శర్వానంద్ పడి పడి లేచె మనసు సినిమా మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న శర్వా ఈ సినిమా ఫ్లాప్ అవడంతో తన నెక్స్ట్ సినిమా మీదా బాగా కాన్సన్‌ట్రేషన్ చేస్తున్నాడు. కాస్త ఆలస్యమైనా శర్వానంద్ - సుధీర్ వర్మ 'రణరంగం' సినిమా పూర్తయింది. ఫస్ట్ హాఫ్ ఫైనల్ ఎడిటింగ్ రీసెంట్‌గా కంప్లీటయిందట. సెకండాఫ్ ఫైనల్ ఎడిట్ కూడా దాదాపు పూర్తయిందని సినిమా బాగా వచ్చిందని సమాచారం. కెరీర్ మీద చాలా కేర్ గా వున్న శర్వానంద్ ఫైనల్ ఎడిట్ అయిన కాపీ చూసుకొని చాలా ఆనందంగా ఉన్నాడట.


గతంలో తన పాత్ర ఎలా వచ్చిందని మాత్రమే ఎక్కువగా చూడడం శర్వాకు అలవాటు. అయితే ఈసారి సినిమా టోటల్ అవుట్ పుట్ ఎలా వుంది అన్నది పక్కాగా చూసుకున్నాడని తెలుస్తోంది. ఇదిలావుంటే సితారకు బ్యాక్ బోన్ అయిన హారిక హాసిని నిర్మాత చినబాబు కూడా ఎడిట్ కాపీ చూసి, చిన్న చిన్న చేంజెస్ మాత్రమే చెప్పి, శర్వాను కంగ్రాట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టులో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాలో శర్వానంద్ ఓ సాధారణ స్థాయి నుంచి ఒక పెద్ద మాఫియా లీడర్ వరకు ఎలా ఎదిగాడు అన్నది స్టోరీ అని ఇంటర్నల్ టాక్. 


ఒకవేళ అదే గనక నిజమైతే ఈ క్యారెక్టలో శర్వా అదరగొట్టడం ఖాయం. ఇక మామూలుగా ప్రెజెంట్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ల మాదిరిగా కాకుండా, కొత్తగా రెండు షేడ్స్ ను చూపిస్తూ సుధీర్ వర్మ మాంచి స్క్రీన్ ప్లే అందించినట్లు తెలుస్తోంది. మరి ఇన్ని ఆశలు పెట్టుకున్న శర్వాకి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: