బిగ్ బాస్....తెలుగు నట అఖండ ప్రజాదరణ సంపాదించుకున్న ప్రోగ్రాం. అలానే కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ కూడా. ఈ ఏడాది తెలుగు బిగ్ బాస్ కి అన్ని సమస్యలే. ప్రోగ్రాం హోస్ట్ దెగ్గర నుంచి, హౌస్ సభ్యులు ఎవరు ఉండబోతారో ఎవ్వరికి ఇంక ఫుల్ క్లారిటీ లేదు.


ముఖ్యంగా హోస్ట్ విషయంలో ఇన్ని రోజులు చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. హోస్ట్ గా నాగార్జున దాదాపుగా ఓకే అయ్యాడు. ఇక ప్రస్తుతం పార్టిసిపెంట్స్ ఎంపిక విషయంలో చర్చలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ 3 లో పార్టిసిపెంట్స్ అంటూ కేఏ పాల్ మరియు రేణు దేశాయ్ ఇంకా ఎంతోమంది పేర్లు వస్తున్నాయి. కానీ అవన్నీ పుకార్లే. రేణు దేశాయ్, కేఏ పాల్ లు పార్టిసిపేట్ చేయకపోవచ్చు.


ఇష్టం వచ్చినట్లుగా ఎవరికీ తోచిన విధంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నిజమైన పార్టిసిపేట్స్ ఎవరై ఉంటారా అని జనం కంఫ్యూజ్ అవుతున్నారు. ఈ సమయంలో తీన్మార్ సావిత్రి పేరు కూడా బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్స్ జాబితాలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి.  గత కొన్ని సంవత్సరాలుగా వీ6లో ప్రసారం అవుతున్న తీన్మార్ వార్తలతో సావిత్రి అలియాస్ జ్యోతి బాగా ఫేమస్ అయ్యింది.


తెలంగాణ అమ్మాయిగా బిగ్ బాస్ 3 లో జ్యోతి ఎంట్రీ ఉండవచ్చు అంటున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతున్న తీన్మార్ వార్తలను వదిలేసి జ్యోతి బిగ్ బాస్ లో పార్టిసిపెట్ చేయకపోవచ్చు అనే వాదన కూడా వినిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: