పవన్ కళ్యాణ్ మంగళగిరిలో నిర్వహించిన ‘జనసేన’ ఓటమి సమీక్షా సమావేశాలలో ఒక అభిమానిని కార్నర్ చేస్తూ కామెంట్స్ చేసాడు అంటూ కొన్ని మీడియా వర్గాలలో వార్తలు వస్తున్నాయి. సాధారణంగా బాలకృష్ణ అసహనంతో తన అభిమానుల పై విరుచుకుపడుతూ ఉంటాడు. 

అయితే ఇప్పుడు ఆ అలవాటు పవన్ కు వచ్చిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆశక్తి కలిగించే ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే పవన్ ఉద్వేగపూరితంగా చేసిన ప్రసంగానికి ప్రభావితమైన ఒక జన సైనికుడు పవన్ కు ‘జనసేన’ నిర్వాహణలో కొన్ని సూచనలు ఇవ్వడానికి ప్రయత్నించినట్లు సమాచారం. 

దీనితో తీవ్ర అసహనానికి లోనైన పవన్ ‘జనసేన’ ఎన్నికలలో ఎందుకు పరాజయం చెందిందో కారణాలు విశ్లేషిస్తూ అనేక ఛానల్స్ ప్రసారం చేసిన కథనాలు తాను చూశానని కొత్తగా ఆ విషయాలను మళ్ళీ తనకు గుర్తు చేయక్కరలేదు అంటూ పవన్ ఆ అభిమానికి చురకలు అంటించినట్లు టాక్. అంతేకాదు పవన్ నవ్వుతూ ఆ అభిమాని వంక చూస్తూ ఆ అభిమాని కుటుంబ సభ్యులలో ఎన్ని ఓట్లు ‘జనసేన’ కు పడ్డాయి అని అడిగినట్లు తెలుస్తోంది. 

ఈ అనుకోని ప్రశ్నకు షాక్ అయిన ఆ వీరాభిమాని తన ఓటు మాత్రం జనసేనకు పడిందనీ అయితే తన కుటుంబ సభ్యుల ఓట్లు మాత్రం జగన్ కు పడ్డాయి అంటూ షాకింగ్ సమాధానం ఇవ్వడంతో పవన్ ఆ సమాధానానికి ఆశ్చర్యపోయి ఒక షాకింగ్ కామెంట్ చేసినట్లు టాక్. తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కూర్చుని తన కుటుంబ సభ్యులు జనసేనకు ఓటు వేసారు అని చెపితే ఆ పార్టీలో అలా చెప్పిన వ్యక్తికి ఎలాంటి గౌరవం ఉంటుందో ఊహించుకోమని చెపుతూ తన జనసేన పార్టీ సభ్యులకు తాను ఇస్తున్న స్వేచ్చ ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవాలి అంటూ తనకు సలహాలు ఇచ్చే బదులు పార్టీ గురించి ఆలోచిస్తే కనీసం వచ్చే ఎన్నికలకు అయినా ‘జనసేన’ కు ఓట్లు పడతాయి అంటూ పవన్ చురకలు అంటించినట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: