రచయిత దర్శకుడు నటుడుగా రాణిస్తున్న తనికెళ్ళ భరణి మంచి సాహితీ వేత్త. ‘మిధునం’ లాంటి సినిమాను తీసి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన భరణికి అంతర్జాతీయ స్థాయిలో ‘భక్తకన్నప్ప’ జీవితాన్ని భారీ బడ్జెట్ మూవీగా తీయాలి అన్నది ఆయన కోరిక. 

ఇలాంటి పరిస్థుతులలో తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత తనను కలిసిన మీడియా వర్గాలతో తాను నటిస్తున్న సినిమా విశేషాలు తెలుపుతూ మధ్యలో చిరంజీవి ‘సైరా’ గురించి చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి. తాను ‘సైరా’ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయాన్ని తెలియచేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చరిత్రను మార్చబోయే మూవీ ‘సైరా’ అంటూ ఆ సక్తికర కామెంట్స్ చేసాడు.

ఇదే సందర్భంలో భరణి మాట్లాడుతూ ఈమూవీలో చిరంజీవి నటన విశ్వరూపాన్ని చూడబోతున్నారు అంటూ మెగా అభిమానులకు జోష్ ను కలిగించాడు. వాస్తవానికి ఈమూవీలో అమితాబ్ సుదీప్ విజయ్ సేతుపతి లాంటి అనేకమంది టాప్ స్టార్స్ నటిస్తున్నా ఇప్పటి వరకు వారిలో ఎవ్వరూ ‘సైరా’ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ గురించి తనికెళ్ళ భరణి ఇంత ప్రత్యేకంగా చెప్పడం వెనుక ఎదో ఒక కారణం ఉండి ఉంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలదు అన్నట్లుగా భరణి వచ్చే ఆగష్టు నుండి తన దర్శకత్వంలో ఒక సినిమాను తీయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు స్వయంగా భరణి చెప్పడంతో త్వరలోనే ఈయన దర్శకత్వంలో ఒక మంచి సినిమా చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు కలగబోతోంది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: