ప్రభాస్... శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్న సినిమా సాహో. ఈ సినిమా ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ జూన్ 13 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. సాహో కథ వీక్ గా ఉన్నా.. యాక్షన్ పార్ట్ వలన సినిమా బాగుంటుందనే అంటున్నారు.
ఇక ఈ సినిమా కు సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతున్నది. మరో రెండు మూడు రోజుల్లో ఈ సాంగ్ షూట్ కంప్లీట్ అవుతుంది. అయితే, ఈ ఐటెం సాంగ్ తరువాత ప్రభాస్ శ్రద్దా కపూర్ లు ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నారు. ఆస్ట్రేలియాలో రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తారట.
ఈ సినిమా కోసం యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్టు తెలుస్తోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నారు.
తెలుగులో ఈ సినిమా 130 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఇక రిల్ రాజు నైజాం రైట్స్ ను 45 కోట్ల రూపాయలకు తీసుకోవడం విశేషం. జూన్ 13 తరువాత సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి.