వెయ్యి సినిమాలకు పైగా నటించిన గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న బ్రహ్మానందం త్వరలో బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా మరో స్టార్ కమెడియన్ అండ్ హీరో. ఇదే ఒక సెనేషనల్ న్యూస్ అని అనుకుంటున్న అందరికి ఇంకో న్యూస్ తో షాకిచ్చారు. ఇదే సినిమాలో ఈ ఇద్దరితో కలిసి సన్నీ లియోన్ కూడా స్క్రీ షేర్ చేసుకోబోతోంది. బాలీవుడ్‌లో తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించబోయే హింది సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో భాగ్ జానీ సినిమాతో పాటు, బిగ్ బాస్ సీజన్ 9 లో పార్టిసిపేట్ చే సి రన్నరప్ గా విన్నయిన మందన కరిమి  మరో ముఖ్యమైన పాత్ర పోషించనుంది. 


హారర్ కామెడీ జానర్ లో రూపొందబోయే ఈ  సినిమా కు ఇంకా టైటిల్ డిసైడ్ కాలేదని కాకపోతే ఒక ఇంట్రస్టింగ్ టైటిల్ మాత్రం చిత్ర బృందం అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా దర్శకుడు తెలుగు వాడే కావడం వల్ల సునీల్, బ్రమ్మీలకు ఈ ఛాన్స్ వచ్చింది. కాబట్టి నార్త్ ప్రేక్షకులకు తమ కామెడీ టేస్ట్ ని స్ట్రెయిట్ గానే చూపించబోతున్నారు ఇద్దరు. ఇదే సినిమాలో సునీల్ మీద ఓ పాట కూడా ఉంటుందని తెలిసింది. ఎలాగూ కరెంట్ తీగ, పీ.ఎస్.వి.గరుడ వేగ సినిమాలతో సన్నీ, టాలీవుడ్ స్టార్ కమెడియన్స్‌గా సునీల్-బ్రమ్మీ మనకు పరిచయమున్న వాళ్ళే కాబట్టి తెలుగులోనూ డబ్బింగ్ చేస్తారు. మహేందర్ ధరివాల్-పరందీప్ సందు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

ఒకవేళ ఈ సినిమా కనక బాలీవుడ్‌లో హిట్టయితే అయితే ఈ ఇద్దరు హాస్య నటులకు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ కెరీర్ స్టార్ట్ అయినట్టే. స్ట్రైట్ సినిమాలు చేయలేదనే మాటే కాని మన సినిమాలు డబ్బింగ్ రూపంలో నార్త్ ప్రేక్షకులు సినిమాలు చాలానే ఎంజాయ్ చేశారు. ప్రతి సినిమాలో కనిపించే బ్రమ్మీ వాళ్ళకు పరిచయమే. కాకపోతే హింది నటీనటులతో నటించడం మాత్రమే కొత్త. ఆ మధ్య అనారోగ్యంతో కొంత గ్యాప్ ఇచ్చినా బ్రహ్మానందం మళ్ళి స్పీడ్ అందుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: