నాగచైతన్య హీరోగా మహాసముద్రం అనే సినిమా వస్తుందని అంతా అనుకున్న సంగతి తెలిసిందే. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్టు రవితేజ కి షిఫ్టయింది. ఈ సంగతి అందరికి తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత దర్శకుడు అజయ్ భూపతి చేయబోతున్న ఈ ప్రాజెక్టు గురించి అందరికీ తెలిసింది ఇంతవరకు మాత్రమే. కానీ చాలామందికి తెలియని విషయం ఒకటుంది. ఏంటంటే.. మహాసముద్రం సినిమా వర్క్ ఆల్రెడీ మొదలైందని ఇంటర్నల్ టాక్.


ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్, ఈ సినిమా కోసం ఇప్పటికే 2 పాటలు కంపోజ్ చేసిపెట్టాడు. ఆ ట్యూన్స్ ను రవితేజ కూడా ఓకే చేశాడని లేటెస్ట్ న్యూస్. మరోవైపు హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టాడు దర్శకుడు. పాయల్ రాజ్ పుత్, మాళవిక శర్మ, శృతి హాసన్..ఇలా కొంతమంది పేరు పరిశీలనలో ఉన్నాయట. 


ప్రస్తుతం డిస్కోరాజా సినిమా శరవేగంగా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు రవితేజ. ఈ సినిమా పూర్తయ్యేసరికి పాటలు, స్క్రీన్ ప్లేతో సిద్ధంగా ఉండాలని రవితేజ అజయ్ భూపతికి చెప్పాడట. డిస్కోరాజా పూర్తయిన వెంటనే మహాసముద్రం తో  సెట్స్ పైకి వెళ్దామని హామీ ఇచ్చాడు. అందుకే గుట్టుచప్పుడు కాకుండా సినిమా వర్క్ మొదలుపెట్టారు అజయ్ భూపతి. ఇక ఈ సినిమాను జెమినీ కిరణ్ ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఇతడితో పాటు మరో నిర్మాత కూడా భాగస్వామిగా చేరే అవకాశం ఉందని లేటెస్ట్ అప్డేట్.  



మరింత సమాచారం తెలుసుకోండి: