అదేంటి సైరా సినిమా ఇంకా సెట్స్ పైనే ఉన్నది కదా.... అప్పుడే ఆ సినిమా గురించి టాక్ ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నారా.... ఇప్పటివరకు ఈ సినిమాకు సంబందించిన విషయాలను మీడియా ఎదురుగా ఎవరు చెప్పలేదు. మొదటిసారిగా ఈ సినిమా గురించి ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి స్పందించారు.


ఇంతకీ సినిమా గురించి అయాన్ ఏమి చెప్పారు అంటే.... తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తనికెళ్ళ భరణి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... ఈ సినిమా మెగా అభిమానుల అంచనాలను మించి ఉంటుందని, సైరా సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింతగా పెంచుతుందని అన్నారు.


ఆలస్యానికి చింతించవద్దని అభిమానులకు అయన సూచించారు. కష్టే ఫలి. కష్టానికి తగ్గఫలితాన్ని దక్కుతుంది. సైరా సినిమాలో నేను ఓ కొత్త తరహా పాత్రలో నటిస్తున్నా. ఆ అవకాశం రావడం సంతోషంగా ఉన్నది. నన్ను ప్రేక్షకులు ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని తనికెళ్ళ భరణి అన్నారు.


ఇదిలా ఉండగా, సైరా గురించి అటు ప్రొడక్షన్ హౌస్ గాని, ఇటు నటి నటులుటీ ఏరకమైన క్లారిటీ ఇవ్వకపోవడం తో రక రకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అనుష్క స్పెషల్ సాంగ్ మరియు కట్టి ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ గ నిలుస్తాయి అని వార్తలు వచ్చాయి. ఈ ట్రెండ్ ని చూస్తుంటే 'సైరా' అభిమానులు కూడా 'సాహు' కి మల్లె ఉపాదాట్లు కోసం సోషల్ మీడియా లో బ్రతిమిలాడే పరిస్థితి కనిపిస్తోంది. 
ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ 2 నుంచి వాయినా పడింది అని వార్తలు వచ్చాయి. చూడాలి మరి, తనికెళ్ళ భరణి గారు చెప్పినట్టు, సహనం పాటిస్తే సైరా మన సహనానికి తగిన ప్రతిఫలం ఇస్తుందో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: