బిగ్ బాస్ మూడో సీజన్ లో కేవలం సెలబ్రెటీలు మాత్రమే తీసుకోవాలని షో నిర్వాహకులు అనుకుంటున్నారట. ముఖ్యంగా రెండో సీజన్ లో సెలబ్రెటీలు లేకపోవడంతో కంటెస్టెంట్స్ కొత్తవారు రావాడంతో రెండో సీజన్ అలరించలేకపోయింది అని ఇన్ సైడ్ టాక్ రావడంతో బిగ్ బాస్ సీజన్ 3 లో ఎక్కువగా సెలబ్రెటీలు ఉండేలా చూసుకుంటున్నారు.


ఈ క్రమంలో రాబోయే సీజన్ 3 లో యాంకర్ గా నాగార్జునని ఖరారు చేసినట్లు పరిశ్రమ వర్గాల టాక్. అంతేకాక తాజాగా మొదలయ్యే సీజన్ లో శ్రీముఖి, రఘు మాస్టర్, వైవా హర్ష ప్రముఖ సినీ నటుడు జాకీ అలాగే వరుణ్ సందేశ్, ఇలా చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించాయి.


ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు రేణు పై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని అంటున్నారు కొందరు. త్వరలో అసలు విషయం తేలిపోతుంది అని బిగ్ బాస్ ప్రేమికులు అంటున్నారు.


ఇదిలా ఉండగా, ఈ సీజన్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న టీవీ యాంకర్లను తీసుకుంటున్నారట. దానిలో భాగంగానే ‘తీన్మార్’ సావిత్రిని ఎంపిక చేశారని అంటున్నారు. ఇన్నాళ్లు వి6 ఛానెల్‌లో తీన్మార్ వార్తలు చదివిని సావిత్రి.. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టనుందని టాక్. మరో తెలంగాణ యాంకర్ శ్రీముఖి కూడా ‘బిగ్ బాస్’ సీజన్ 3లో పాల్గొంటున్నారని అంటున్నారు. అందుకే, ఆమె ‘పటాస్’ షో నుంచి కూడా తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: