మెగా కాంపౌండ్ నుండి వెండితెరకు పరిచయమైన సాయి ధరంతేజ్ తన రేంజ్ కి తగ్గ విజయాన్ని తన ఖాతాలో వేసుకోలేదు. చిరంజీవి పాటలను రీమిక్స్ చేసి ఇంకా చాలా ప్రయోగాలు చేసిన సాయి ధరమ్ తేజ్ మెగాభిమానులను అలరించలేకపోయాడు. చివరిగా తాను చేసిన చిత్రలహరి సినిమా కొద్దో గొప్పో అలరించిన పెద్దగా మాత్రం బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయింది. ఇటువంటి క్రమంలో సాయి ధరమ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ బాబీ చేతిలో పడ్డాడు. జై లవకుశ వంటి భారీ బ్లాక్ బస్టర్ జూనియర్ ఎన్టీఆర్ కి అందించాడు డైరెక్టర్ బాబీ.


అయితే సాయి ధరంతేజ్ నటించబోయే సినిమాకు మాత్రం దర్శకుడిగా కాకుండా నిర్మాతగా బాబి రంగంలోకి దిగినట్లు ఫిలింనగర్ టాక్. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. డైరెక్టర్ ఎవరు అంటే సప్తగిరి సినిమా ‘వజ్ర కవచధర గోవింద’కు దర్శకత్వం వహించిన అరుణ్ పవార్.. బాబీ నిర్మాణంలో తేజు హీరోగా సినిమా చేయబోతున్నాడట. ‘బెస్ట్ యాక్టర్స్’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అతను.. ఆ తర్వాత సప్తగిరిని హీరోగా పరిచయం చేస్తూ ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’ తీశాడు. తర్వాత మళ్లీ సప్తగిరితోనే ఇంకో సినిమా చేశాడు.


ఐతే అతడి రేంజికి తేజుతో సినిమా అంటే కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. అయినా కానీ సాయి ధరంతేజ్ అరుణ్ పవర్ డైరెక్ట్ చేసే విధానం నచ్చి ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం. ప్రస్తుతం సాయి ధరంతేజ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమా అయిన వెంటనే అరుణ్ పవర్ తో సాయి ధరమ్ తేజ్ సినిమా చేయనున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: