ఇద్దరు టాప్ హీరోల సినిమాల టీజర్లు ఒకేరోజు విడుదల కావడం ఎప్పుడు జరగదు. అయితే దీనికి భిన్నంగా రేపు ‘సాహో’ ‘మన్మధుడు 2’ టీజర్లు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవ్వడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.  ప్రభాస్ నటిస్తున్న `సాహో` టీజర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ వేచి చూస్తున్నారు. 

ఈ విషయాన్ని లెక్క చేయకుండా నాగార్జున ‘మన్మధుడు 2’ టీజార్ విడుదలకు కూడ రేపటి రోజును ముహూర్తంగా నిశ్చయించుకున్నాడు. నాగార్జున అమల జంట పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. 13 జూన్ మధ్యాహ్నం ఒంటి గంటకు కింగ్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఉంటుందని ఓ పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ పోస్టర్ లో నాగార్జున క్రౌన్ ధరించిన రియల్ కింగ్ అవతారంలో కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. ఇక ‘సాహో’ టీమ్ కూడ అంతర్జాతీయ స్థాయిలో రేపటి తమ టీజర్ ఉండబోతోంది అంటూ సంకేతాలు ఇస్తోంది. దీనితో రేపటి రోజు అంతా ఈ రెండు సినిమాల టీజర్ల హడావిడితోనే వార్తలు నిండిపోయే ఆస్కారం కనిపిస్తోంది. 

ఇప్పటికే ‘సాహో’ తన రిలీజ్ డేట్ ను ఆగష్టు 15గా ఫిక్స్ చేసుకున్నా అది లెక్క చేయకుండా నాగార్జున ‘మన్మధుడు 2’ మూవీ రిలీజ్ డేట్ ను ఆగష్టు 8గా సంకేతాలు ఇస్తున్నారు. ‘సాహో’ మ్యానియాను  లెక్కచేయకుండా నాగార్జున అనుసరిస్తున్న మితిమీరిన ఆత్మ విశ్వాసం దేనికి సంకేతం అంటూ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. దీనితో నాగార్జున ‘మన్మధుడు 2’ ‘సాహో’ మ్యానియా ముందు అసలు ధియేటర్స్ దొరుకుతాయా అన్న విషయం ఎవరికీ అర్ధంకాని విషయం..   


మరింత సమాచారం తెలుసుకోండి: