టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా హీరోలు ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క సినిమాలు నిర్మిస్తూ మరోపక్క వ్యాపారాలలో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇలాగే సినిమాలు చేస్తూ మరో పక్క యాడ్ లు చేస్తూ ఇటీవల 'ఏఎంబీ' థియేటర్స్ నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా త్వరలోనే మల్టీప్లెక్స్ వ్యాపార రంగంలో అడుగు పెట్టబోతున్నట్లు కూడా తెలుస్తోంది.


ఇటువంటి క్రమంలో మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇండస్ట్రీలో తనకంటూ క్రేజ్ మరియు మంచి గుర్తింపు తెచ్చుకున్న..మరోపక్క వ్యాపార రంగంలో అడుగులు వేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే చాలాచోట్ల త్రివిక్రమ్ పెట్టుబడులు పెట్టినట్లు అలాగే హైదరాబాదు నగరంలో పరిసర ప్రాంతంలో భూములు కొన్నట్లు మంచి ఇల్లు కూడా కట్టుకున్నట్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చాలామంది ఇండస్ట్రీలో చెప్పుకుంటారు.


అయితే తాజాగా లేటెస్ట్ గా త్రివిక్రమ్ థియేటర్ ని కొన్నట్లు. 6 కోట్లు పెట్టి తూర్పుగోదావరి రాజానగరం లో థియేటర్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆ థియేటర్ ను ఈస్ట్ లోనే ఒకరికి నిర్వహణకు అప్పగించారు. రాయుడు అనే ఈ థియేటర్ ని గతేడాది రిన్నోవేట్ చేశారు. ఆ సమయంలోనే థియేటర్ ను మూడున్నర కోట్లకు అమ్మాలని చూశారు. కానీ అప్పట్లో అమ్ముడు కాలేదు. అదే థియేటర్ ను ఇప్పుడు త్రివిక్రమ్ 4.90 కోట్లకు కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: