తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కొంత కాలంగా నడిఘర్ సంఘం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఆయన నడిఘర్ సంఘం అధ్యక్షులు అయినప్పటి నుంచి ప్రత్యర్థులు ఏదో ఒక విషయంలో ఆయనకు ఇబ్బందులు కలుగ జేస్తున్నారని..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

ఆ మద్య నడిగర్‌ సంఘం స్థల విక్రయ వివాదంలో, ఆ సంఘం కార్యదర్శి, హీరో విశాల్‌ కాంచీపురం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. కాంచీపురం ప్రాంతంలో నడిగర్ సంఘానికి 26 సెంట్ల స్థలం ఉండగా, దాన్ని మాజీ అధ్యక్ష, కార్యదర్శులు శరత్ కుమార్, రాధారవిలు విక్రయించారని, ఈ డీల్ లో అవకతవకలు జరిగాయని విశాల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

కాగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని, విచారణకు రావాలని విశాల్ కు నేర పరిశోధనా విభాగం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో హీరో విశాల్ ప్రత్యక్షంగా పోలీసుల ఎదుటకు వచ్చి స్థల విక్రయానికి సంబంధించిన వివరాలను అందించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: