చాలా మంది డైరెక్టర్లు  ఫ్లాప్ హీరోయిన్లకి అవకాశాలు ఇవ్వాలంటే భయపడతారు. అదీగాక ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఒక్కసారి ఫ్లాప్ హీరోయిన్ అని ముద్ర వేసుకున్న తర్వాత వాళ్ళకి వరుసగా అవకాశాలు తగ్గిపోతుంటాయి.

ఇందుకు భిన్నంగా ’చిత్రలహరి’ సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని, నివేతా పేతురాజ్ లాంటి ఫ్లాప్ హీరోయిన్లను తీసుకుని హిట్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్.  వీరిద్దరికీ ఇంతవరకు ఒక్క హిట్టు కూడా లేదు.

ఇదే ఫార్ములాతో తన తదుపరి చిత్రంలో కూడా ఫ్లాప్ హీరోయిన్ అయిన రుక్సానా థిల్లర్ ని తీసుకున్నారట. మారుతి డైరెక్షన్ లో "ప్రతి రోజూ పండగే" అనే టైటిల్ తో రూపుదిద్దుకుంటుంది . ఈ సినిమా కోసం ముందు చాలా మంది హీరోయిన్లనే అనుకున్నారట.

కానీ పెద్ద హీరోయిన్లను తీసుకుని వారికి కోట్లకొద్ది పారితోషికాలు ఇచ్చుకోలేక, అందం, అభినయం రెండు కలిగిన రుక్సానా థిల్లర్ ని ఎంచుకున్నరట. రుక్సానా థిల్లర్ ’కృష్ణార్జున యుద్ధం’ ’ఎబిసిడి’ లాంటి ఫ్లాపు చిత్రాల్లో నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: