మొత్తానికి శర్వానంద్ బ్యాక్ టూ బ్యాక్ రెండు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 'సుధీర్ వర్మ'  డైరెక్షన్ లో 'రణరంగం' అనే చిత్రంతో పాటు తమిళ హిట్ చిత్రం '96' తెలుగు రీమేక్ కూడా నటిస్తోన్నాడు. 
కాగా తుది దశలో  ఉన్న 'రణరంగం' ఆగస్టు 2న విడుదలకానుండగా 96 రీమేక్ ఆగష్టు నెలాఖరుకి పూర్తి కానుంది. ఈ చిత్రాలు అవ్వగానే మరో  కొత్త సినిమా మొదలయ్యేలా ఇప్పటికే  గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు శర్వానంద్. 


పైగా అది తెలుగు సినిమా కూడా కాదు.. డైరెక్ట్ తమిళ చిత్రం చెయ్యబోతున్నాడు.  ఈ సినిమాను ప్రముఖ కొరియోగ్రఫర్ రాజు సుందరం డైరెక్ట్ చేయనున్నారు.  కొన్నిరోజులుగా చర్చల దశలోనే ఉన్న ఈ సినిమా  అన్ని అంశాలు అనుకూలించడంతో సెట్స్ మీదికి వెళ్లేందుకు రెడీ అవుతుంది.  అయితే ఈ సినిమా తెలుగులో డబ్ కానుంది. మరి శర్వానంద్ కి తమిళంలో హిట్ వస్తోందేమో చూడాలి.


 ఇప్పటికే గతంలో  2011లో వచ్చిన తమిళ్ సినిమా  'ఎంగేయుమ్ ఇప్పోతుమ్' (తెలుగులో జర్నీ)లో శర్వానంద్ నటించాడు. మళ్లీ దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై  తమిళ్ ప్రేక్షకుల్లో కూడా బాగానే ఆసక్తి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: