వెండితెరపై కొన్ని సినిమాల్లో నటించిన శ్రీముఖకి పెద్దగా గుర్తింపు రాలేదు.  దాంతో టెలవిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. యాంకర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన శ్రీముఖికి ‘పటాస్’లో రాములమ్మ గా మంచి పేరు తెచ్చింది. ‘పటాస్’లో యాంకర్ రవితో కలిసి చేసే చిత్ర విచిత్ర విన్యాసాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది శ్రీముఖి.  గతంలో వీరి మద్య రక రకాల రూమర్లు కూడా పుట్టుకు వచ్చాయి.  అయితే యాంకర్ గా బాగా పాపులర్ అయిన తర్వాత వెండి తెరపై వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.


ప్రస్తుతం బుల్లితెరపై అనసూయ, రష్మీ తరువాత హాట్ యాంకర్ స్థానంలో శ్రీముఖి కనిపిస్తుంది.  ఈ మద్య శ్రీముఖి ‘బిగ్ బాస్ 3’లో అడుగు పెట్టబోతుందని.. అందుకే పటాస్ కి గుడ్ బాయ్ చెప్పిందని సంచలన  వార్తలు వచ్చాయి..కానీ దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు.  తాజాగా అభిమానులతో చేసిన లైవ్ చాట్ లో అనేక ప్రశ్నలకి సమాధానాలిచ్చింది."మొదటి నుంచి కూడా నాకు విలన్ రోల్స్ అంటే ఇష్టం. ఎందుకంటే నిజజీవితంలో నేను చాలా మంచిదాన్ని.. కనీసం విలన్ రోల్స్ ద్వారానైనా నాలోని విలనిజాన్ని మీకు చూపించాలనే కోరిక నాలో బలంగా వుంది. 


విలన్ పాత్రల్లో నటనకి ఎక్కువ స్కోప్ వుంటుంది. అలాంటి పాత్రల ద్వారా నటిగా నిరూపించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే విలన్ పాత్రలు చేసే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాని అంటుంది..అయితే మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని..నటించే సత్తా ఉంటే ఎలాంటి పాత్రలకైనా జీవం పోయవచ్చని..అయినా శ్రీముఖి ఇదేం కోరిక అంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: