'సాయి ధరమ్ తేజ్' ఇండస్ట్రీలోకి 'పిల్లా.. నువ్వులేని జీవితం' అనే హిట్ మూవీతోనే ఎంట్రీ ఇచ్చినా.. 'చిత్రలహరి'కి ముందు దాకా ఆరు ప్లాప్ లతో  కొట్టుమిట్టాడాడు. ఎప్పుడో 2015లో వ‌చ్చిన ‘సుప్రీమ్’ త‌ర్వాత చేసిన 'తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు' ఇలా తేజు నటించిన సినిమాలన్నీ భారీ డిజాస్టర్‌ లే.  ఈ డిజాస్టర్‌ ల దెబ్బకి తేజు మార్కెట్ అతి దారుణంగా పడిపోయింది. అందుకే  'నేను శైలజ' ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన   'చిత్రలహరి'కి మంచి పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది.  


మొత్తానికి హిట్ వచ్చినా..  మెగా మేనల్లుడు డీలా పడాల్సిన పరిస్ధితి. దాంతో ప్రస్తుతం  సాయి ధరమ్ తేజ్ - మారుతి సినిమా ఫై కూడా ప్లాప్ ల ప్రభావం పడింది. ముందుగా ఈ చిత్రానికి 20కోట్ల బడ్జెట్ అనుకున్నారు.  కాని తేజు మార్కెట్ చూసి 12 కోట్ల వరకే కేటాయించేలా ఫిక్స్ అయ్యారట గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ సంస్థలు. 


ఇక ఈ చిత్రానికి మొదట్లో 'భోగి' అనే టైటిల్ ప్రచారంలో ఉన్నా  'ప్రతిరోజూ పండగే' అనే పేరును దర్శకనిర్మాతలు ఫైనల్ చేశారని తెలుస్తోంది.  టైటిల్ లాగే సినిమా కూడా పండగలా ఉంటుందేమో చూడాలి.  ఏమైనా ఈ సినిమా ఫలితం బట్టే  బాక్సాఫీస్ వద్ద  'సాయి ధరమ్ తేజ్' రేంజ్ కూడా ఆధారపడి ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: