సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా,   బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కీలక పాత్రలో  స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారీ సినిమా '2.0'. అద్భుతమైన విజువల్స్ తో అండ్  భారీ  నిర్మాణ విలువలతో  ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ ఇచ్చింది ఈ సినిమా. సినిమా చూస్తున్నంతసేపూ  ఓ అత్యుత్తమైన హాలీవుడ్ సినిమా చూస్తున్న  ఫీల్ కలిగించింది. పైగా సినీ విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. అయితే  ఈ సినిమా దక్షిణాదిన ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. అయితే  ఉత్తరాదిన మాత్రం మంచి విజయాన్ని సాధించింది. 


కాగా తాజాగా  ఈ భారీ సినిమా  '2.0'  జూలై 12న చైనాలో భారీ స్థాయిలో  విడుదల కానుంది. పైగా ఐమాక్స్ త్రీడీ ఫార్మాట్లో విడుదల అవుతున్న మొదటి ఇండియన్ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. కాగా ముంబై, చైనాలలో రిలీజ్ కు సంబందించిన ప్రెస్ మీట్స్ జరగనున్నాయి. ఇక చైనాలో రిలీజ్ కి ముందే  ఈ చిత్రాన్ని జూన్ నెలలో జరగనున్న ప్రముఖ షాంగై ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్నారు. ఇక ఈ షాంగై ఫిల్మ్ ఫెస్టివల్‌  ఆసియాలో జరిగే ప్రముఖ ఫెస్టివల్స్ లో  ప్రముఖమైనది. 


మరింత సమాచారం తెలుసుకోండి: