అక్కినేని కుటుంబం నుండి ఇండస్ట్రీకి పరిచయమైన అక్కినేని అఖిల్ కి సరైన హిట్టు పడలేదు ఇప్పటిదాకా. ఎలాగైనా కొడుకుకి హిట్ ఇవ్వాలని తండ్రి నాగార్జున నిర్మాతగా మారి పెట్టుబడులు ఎంత పెట్టినా కానీ బాక్సాఫీస్ దగ్గర అఖిల్ సినిమాలన్నీ బోల్తా పడుతున్నాయి. చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో..అక్కినేని అభిమానులు కూడా కొంత నిరుత్సాహం చెందుతున్నారు.


ఇటువంటి క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో అక్కినేని అఖిల్ ని హీరోగా పెట్టి బన్నీ వాసు నిర్మాణం వహిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి క్రమంలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఇటీవల ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.


ఈ చిత్రంలో అఖిల్ తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఆ పాత్రకు సీనియర్ నటి ఆమనిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే 24 ఏళ్ల క్రితమే అఖిల్ కు ఆమని తల్లిగా సిసింద్రీ సినిమాలో నటించడం జరిగింది. 1995లో సిసింద్రీ సినిమా విడుదలయ్యి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో నాగార్జున హీరోగా చేస్తున్న సమయంలో అఖిల్ పసి బాలుడు గా కనిపించాడు. అయితే చాన్నాళ్ల తర్వాత అఖిల్ తల్లిగా ఆమని ని నటింపజేయడానికి డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: