సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజ హెగ్డే ల కలయికలో కెరీర్ పరంగా మహేష్ 25వ సినిమా మహర్షి సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.100 కోట్ల మార్కును దాటేసి ముందుకు దూసుకెళ్తున్న మహర్షి, విడుదలైన దాదాపుగా అంతి ప్రాంతాల్లో మంచి లాభాలు తెచ్చి పెట్టింది. అయితే ఓవర్సీస్, మరియు సీడెడ్ ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమా కొద్దిపాటి నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అయితే ఓవర్ ఆల్ గా చూస్తే మాత్రం ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు మాత్రం రాబట్టింది అనే చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పటికే నైజాం నవాబ్ గా పలుమార్లు తన సినిమాల రికార్డులతో పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్, మరొక్కసారి మహర్షి తో ఆ పేరుని మరింత సార్ధకం చేసుకున్నారు అనే చెప్పాలి. మిగతా ప్రాంతాల్లో కూడా మహర్షి ఇప్పటికీ పర్వాలేదనిపించేలా కలెక్షన్లు రాబడుతుంటే నైజాం లో మాత్రం ఇంకా బాగానే దూసుకెళుతోందని, ముఖ్యంగా మల్టిప్లెక్స్ లలో ఈ సినిమా ఆక్యుపెన్సీ మరింత ఎక్కువగా ఉంటోంది అని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. 

అప్పట్లో మెగాస్టార్ తరువాత ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాత్రమే అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్నారని, అందువల్లనే ఇప్పటికీ మహర్షి సూపర్బ్ కలెక్షన్లతో నైజాం లో అదరగొడుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే రూ.32 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా అక్కడ నాన్ బాహుబలి రికార్డుగా నిలిచింది. ఇప్పటికీ మంచి కలెక్షన్ రాబడుతుండడంతో క్లోసింగ్ సమయానికి మరొక రెండు నుండి మూడు కోట్లు రావచ్చని అంచనా. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: