యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సాహో. బాహుబలి లాంటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


ఇక ఈ సినిమా టీజర్ ఈరోజు ఉదయం 11:23 గంటలకు రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో సాహో టీజర్ హంగామా మొదలైంది. ఇదిలాఉంటే సాహో టీజర్ ను ముంబైలో రాత్రి కొంతమంది మీడియా వాళ్లకు చూపించడం జరిగిందట. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు సర్ ప్రైజ్ అయ్యారని తెలుస్తుంది.


తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కిస్తున్న సాహో సినిమా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఇక ఈ సినిమా టీజర్ 1 నిమిషం 40 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా సాహో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ఏర్పరచుకున్న ప్రభాస్ సాహోతో మరో సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు.


సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని తెలుస్తుంది. టీజర్ లో ఆ యాక్షన్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి సాహో టీజర్ తోనే ఓ సంచలనంగా మారేలా ఉందని అంటునారు. టీజర్ తోనే ప్రభాస్ సాహో రికార్డుల వేట మొదలు పెడతాడేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: