తెలుసు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు చాలా కామన్.  ఇది ఇప్పటి నుంచి వస్తున్నది కాదు.. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నదే.  బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండేవారు.  ఇద్దరు హీరోయిన్లతో చేసిన సినిమాలు చాలా హిట్ అయ్యాయి.  అలా హిట్ అయిన సినిమాల్లో నాగార్జున మన్మధుడు కూడా ఒకటి.  

మన్మధుడు సినిమాలో అమ్మాయిలకు నాగ్ దూరంగా ఉంటుంటాడు.  కారణం తాను ప్రేమించిన అమ్మాయి దూరం కావడమే.  ఆ అమ్మాయి లేదని తెలుసుకున్న నాగ్ మరో అమ్మాయికి దగ్గరవుతాడు.  ఆ అమ్మాయిని ఎలా దగ్గరయ్యాడు అన్నది సినిమా కథ.  ఎంటర్టైన్మెంట్ రొమాంటిక్ జానర్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టైంది.  

ఇప్పుడు మన్మధుడు 2 లో కూడా ఇద్దరు హీరోయిన్లతో ప్రయోగం చేస్తున్నారు.  రకుల్ ప్రీత్ మెయిన్ హీరోయిన్ కాగా కీర్తి సురేష్ కీలక పాత్ర చేస్తోంది.  మన్మధుడు లో అన్షు చేసిన పాత్రను కీర్తి సురేష్ చేస్తుందా అన్నది తెలియాలి. సోనాలి బింద్రే పాత్రను రకుల్ చేస్తుండొచ్చు.  

ఇద్దరిలో అక్కడ అన్షు చనిపోతుంది.  మరి ఈ సినిమాలో ఎలా చేస్తున్నారో చూడాలి.  మన్మధుడు 2 అంటే అచ్చంగా ఆ సినిమాలాగే ఉంటుంది అనుకోవద్దు.  ఇది వేరు.  ఈ సినిమా స్టోరీ లైన్ వేరు అని ఇప్పటికే దర్శకుడు చెప్పడం విశేషం.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగష్టు 9 వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: