సోషల్ మీడియా సమాజానికి ఎంత మేలు చేస్తుందో అంతకన్నా ఎక్కువ కీడును చేస్తుంది. ముఖ్యంగా ఈ కీడు చేసే అంశాలో ట్రోలింగ్ ఒకటి.  తమకి నచ్చని వాళ్ళని ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ట్రోలింగ్ చేస్తుంటారు.

ఈ ట్రోలింగ్ అనేది సినిమా వారి పట్ల ఇంకా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది హీరోలు హీరోయిన్లు  ఈ ట్రోలింగ్  బారిన పడ్డవారే. తాజాగా "విజేత" సినిమా హీరో, చిరంజీవి చిన్నల్లుడు "కళ్యాణ్ దేవ్" కూడా ఈ ట్రోలింగ్ బారిన పడ్డాడు

గత కొంతకాలంగా కొందరు నెటిజన్లు ఫేక్ అకౌంట్స్ ద్వారా అసభ్యకరమైన భాషలో దూషిస్తున్నారట. ఇలా చాలా రోజుల నుండి జరుగుతుందట. మొదట్లో తేలిగ్గా తీసుకున్నాడట. కానీ మరీ ఎక్కువ అవడంతో   సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసాడు.

పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ స్టార్ట్ చేసారట. ట్రోలర్ల వివరాల కోసం ఇన్స్టాగ్రామ్ కి  లేఖ రాసారట. వారు వివరాలు అందజేయగానే  ట్రోలర్లపై చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: