సినిమా ఇండస్టీ లో కొన్ని పరిణామాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఒకరి కోసం కథ రాసుకుంటే, ఆ హీరోకి టైం కుదరకనో ,లేక మరే కారణాల వల్లనో అది వేరే హీరో దగ్గరికెళ్తుంది. అనిల్ రావిపూడికి కూడా అలాంటి సంఘటనే జరిగింది.

అనిల్ రావిపూడి తాజా చిత్రం మహేష్ బాబుతో చేస్తున్నాడని తెలిసిందే. అయితే ఆ కథని ముందుగా బాలక్రిష్ణకి 100 వ సినిమా టైంలో  చెప్పాడట. బాలక్రిష్ణకి ఆ కథ బాగా నచ్చిందట. కానీ తన 100 వ చిత్రం సీరియస్ గా ఉండాలని అనుకున్నాడట.

అందుకని క్రిష్ దర్శకత్వంలో "గౌతమి పుత్ర శాతకర్ణి" సినిమాను తన 100 వ సినిమాగా ఎంచుకున్నాడు. దీంతో అనిల్ రావిపూడి అదే కథకు కొన్ని మార్పులు జోడించి మహేష్ కి వినిపించాడట. మహేష్ వెంటనే ఓకె చెప్పేయడంతో సినిమా పనులు స్టార్ట్ చేసాడు.

“ఎఫ్ 2” సినిమాతో బారీ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబు 26 వ సినిమాకి " సరిలేరు నీకెవ్వరు" అనే టైటిల్ పెట్టాడు. ఇందులో మహేష్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. అలాగే చాలా రోజుల తర్వాత విజయశాంతి గారు ఈ సినిమాతో తెర ముందుకు రాబోతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: