దివంగత రామానాయుడు కుమారుడు దగ్గుబాటి సురేష్ బాబు నిర్ణయంపై బాలీవుడ్ హీరోయిన్లు ఆసక్తి చూపిసున్నారట.  "ఓ! బేబీ " సినిమాను హిందీలోకి రీమేక్  చేస్తున్నానని ప్రకటించడమే దానికి కారణం. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించడానికి ఇద్దరు హీరోయిన్లు ఆసక్తిగా ఉన్నారట.

ఇకపోతే ఈ సినిమా దక్షిణ కొరియాలో బ్లాక్ బస్టర్ మూవీ అయిన "మిస్ గ్రానీ" కి తెలుగు రీమేక్ గా వచ్చింది. ఇందులో లీడ్ రోల్ ని సమంత పోషిస్తుంది. ఈ చిత్రానికి బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సురేష్ బాబు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ఓ రహస్య స్టూడియో లోకి వెళ్ళిన ముసలావిడ తనను తాను ఫోటో తీసుకుంటుంది. ఫోటో తీసుకున్నాక అకస్మాత్తుగా 20 ఏళ్ళ అమ్మాయిగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో జనరేట్ అయ్యే ఫన్  ట్రీట్ మెంట్ సినిమానే " ఓ !బేబీ". ఈ చిత్రంలో సమంత. సీనియర్ నటి లక్ష్మీ నటిస్తున్నారు

సురేష్ బాబు నిర్ణయంతో బాలీవుడు లోని జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్ ఆ అవకాశం తమకే రావాలని ఆశపడుతున్నారట. చూడాలి మరి సురేష్ బాబు హిందీ లో ఎవరికి ఆ ఛాన్స్ ఇస్తాడో.



మరింత సమాచారం తెలుసుకోండి: