అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న చిత్రం "సూర్యవంశి" ఈ సినిమాని 2020 లో రంజాన్ సందర్భంగా విడుదల చేస్తామని  ముందుగా ప్రకటించారు. అయితే అదే సమయంలో సల్మాన్ ఖాన్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది

సల్మాన్ ఖాన్, అలియా భట్ హీరో,హీరోయిన్లుగా  సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో "ఇన్షా అల్లా" సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా విడుదల తేది ప్రకటించగానే, " సూర్యవంశి" దర్శకుడు రోహిత్ శెట్టి తన సినిమా విడుదల తేదిని మార్చాడు.

ఈ విషయం గురించే బాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. బెంగాలీ నటుడు "అంకుష్" పెద్ద సినిమాలని ఒకే రోజు విడుదల చేయడం మంచిది కాదని, దానివల్ల చాలా నష్టపోతున్నామని చెప్పాడు.

మొన్న రంజాన్ కి విడుదలయిన "భారత్" సినిమా వల్ల బెంగాలీ సినిమాలయిన ’కిడ్నాప్’ ,శేష్ టేక్ షురు’ సినిమాలకి థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు పెద్ద సినిమాలు కావడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: