యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో టీజర్ గురువారం ముందుగా చెప్పినట్టుగానే 11.23 గంటలకు రిలీజ్ అయింది. సాహో టీజర్ వచ్చి రావడంతోనే యూట్యూబ్ లో రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది.సుజిత్ కుమార్ డైరెక్షన్లో రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ ప్రియుల‌కు మంచి విందు భోజనాన్ని అందించనుంది. 1. 39 సెకన్ల పాటు ఉన్న టీజర్లోనే డైరెక్టర్ సుజిత్ లెక్కలేనన్ని యాక్షన్ ఫ్రేములు దించేశాడు.


కార్‌, బైక్ రేసింగులు, భీక‌ర‌మైన పోరాటాలు చేస్తోన్న విల‌న్లు, ఖ‌రీదైన బిల్డింగులు, ప్ర‌తి ఫ్రేములోనూ ఓవ‌రాల్‌గా ఫైట్లు ఎలా ఉండ‌బోతున్నాయో చెప్ప‌క‌నే చెప్పేశారు. టీజ‌ర్‌లో ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను చూపించ‌డంతో పాటు కేవ‌లం యాక్ష‌న్ మీదే కాన్‌సంట్రేష‌న్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక బాహుబ‌లి సినిమా తెలుగు సినిమా రేంజ్‌ను ఎలా పెంచిందో చూశాం. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయి సినిమా మ‌న వాళ్లు తీస్తారా ? అన్న సందేహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సాహో టీజ‌ర్ చూస్తుంటే కేవ‌లం బాహుబ‌లి లాంటి సినిమాల‌తోనే కాకుండా సాహో లాంటి సినిమాల‌తో మ‌నం మ‌రోసారి నేష‌న‌ల్ వైడ్‌గానే కాకుండా ఇంట‌ర్నేష‌న‌ల్ వైడ్గా కూడా తెలుగు సినిమా స‌త్తా చూపించే అవ‌కాశం వ‌చ్చింద‌న్న న‌మ్మ‌కాలు క‌లుగుతున్నాయి.


బాహుబ‌లి దెబ్బ‌తోనే తెలుగు సినిమా చూసి ఇటు కోలీవుడ్ వాళ్లు, అటు నార్త్ వాళ్లు జ‌డుసుకున్నారు. ఇప్పుడు సాహోతో మ‌రోసారి వాళ్ల‌కు కంటిమీద కునుకు ఉండే ప‌రిస్థితి లేదు. టీజ‌ర్‌తోనే వాళ్ల‌కు ఈ ప‌రిస్థితి ఉంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెలా ఉంటుందో ?  చూడాలి. ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజిత్ రూపొందించిన ఈ భారీ బ‌డ్జెట్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించింది. యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌ ఈ సినిమాను నిర్మించింది. ఇండిపెండెన్స్ డే కానుక‌గా  ఆగ‌స్ట్ 15వ తేదీన ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ముర‌ళీ శ‌ర్మ‌, వెన్నెల కిశోర్‌, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: