బుల్లితెర పై ఎన్ని రియాలిటీ షోలు వచ్చినా ‘జబర్దస్త్’ మ్యానియా కొనసాగడానికి గల కారణం ఆ కార్యక్రమంలో ప్రసారం అయ్యే స్కిట్స్ లోని డైలాగులలో ఉండే బూతు కంటెంట్. ఇప్పుడు అదే విధానాన్ని నాగార్జున కూడ తన ‘మన్మధుడు 2’ టీజర్ విషయంలో అనుసరించారా అని సందేహాలు కలగడం సహజం. 

దీనికి కారణం కొద్ది సేపటి క్రితం విడుదలైన ‘మన్మధుడు 2’ టీజర్ లో ఎంటర్ టైన్మెంట్ పేరుతో కొన్ని ద్వందార్ధాల డైలాగ్స్ స్పష్టంగా వినిపిస్తున్నాయి. ‘పిల్లలకు కోచింగ్ ఇవ్వవలసిన వయసులో నువ్వు బ్యాటింగ్ కు దిగుతున్నావు ఏమిటీ ? ఎండిపోయిన చెట్టుకు నీళ్ళు పోస్తే పువ్వులు పూస్తాయా ? నువ్వు వర్జిన్ వే కదా? ఇంకా వర్జిన్ వే కదా?’ అంటూ హాస్యం పేరుతో బూతు డైలాగులు చాల వినిపించాయి. 

ప్రస్థుతం నాగార్జునకు హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి ఈ బూతు డైలాగుల కల్చర్ ను తిరిగి మళ్ళీ ‘మన్మధుడు 2’ ద్వారా ప్రవేశపెడుతున్నారా అన్న సందేహాలు రావడం సహజం. ఈ టీజర్ ను చూసిన వారికి నాగార్జున ఈమూవీలో శ్రీరాముడు లా శ్రీకృష్ణుడు లా రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు అన్న క్లారిటీ వస్తోంది.  

వాస్తవానికి ఈ సినిమా టీజర్ ను అత్యంత సాహస వంతంగా ‘సాహో’ టీజర్ రిలీజ్ అయిన కొన్ని గంటలకే విడుదల చేయడం ఒక హాట్ టాపిక్ అయితే ఈమూవీని ‘సాహో’ మ్యానియాను లెక్కచేయకుండా ‘సాహో’ విడుదలకు కేవలం ఒక్క వారం ముందు ఆగష్టు 8న విడుదల చేస్తూ ఉండటం మరింత సాహాసం. దీనితో ఎవరు ఊహించని విధంగా నాగ్ ప్రభాస్ ల మధ్య నిజంగానే పోటీ జరుగుతుందా దానికి తగ్గట్టుగా ‘సాహో’ మ్యానియా ముందు ‘మన్మధుడు 2’ కి ధియేటర్స్ దొరుకుతాయా అన్న విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్..  


మరింత సమాచారం తెలుసుకోండి: