ప్రస్తుతం బాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోయిన్ గా కియారా అద్వానీ మంచి గుర్తింపు దక్కించుకుంది. భవిష్యత్తులో కియారా స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు . ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ నటించేందుకు సిద్దం అవుతున్న కియార తెలుగులో 'భరత్ అనే నేను' 'వినయ విధేయ రామ' సినిమాలలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితం అయిన కియారా అద్వానీ అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్' పూర్తి చేసి విడుదల కోసం ఎదురు చూస్తుంది. బోల్డ్ పాత్రల్లో నటించేందుకు ముద్దు సీన్స్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా నటిస్తున్న కియారా అద్వానీ రీసెంట్‌గా కొన్ని ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. 


సినిమాలతో పాటు కియారా అద్వానీ వెబ్ సిరీస్ లను కూడా చేసిన సంగతి అందరికి తెలిసిందే. లవ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో కియారా అద్వానీ మరీ బోల్డ్ పాత్రలో నటించింది. అమాయకపు పాత్రలో కనిపిస్తూనే కియారా అద్వానీ రొమాంటిక్ సీన్స్ లో కూడా కనిపించింది. ఆ వెబ్ సిరీస్ లో కియారా అద్వానీ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఆ పాత్రతో నటిగా కూడా మంచి పేరును సంపాదించుకుంది. అయితే అలాంటి సీన్స్ చేయడంపై కొందరు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. 


అయితే ఆ పాత్రపై రొమాంటిక్ సీన్‌పై కియారా.. ఆ పాత్ర అమాయకత్వంతో కూడిన అమ్మాయి అవ్వడం వల్ల అందరికి సానుభూతి ఉంటుంది. అందుకే అలాంటి సీన్ లో ఎక్కువ మంది వల్గారిటీని చూడరు. కాబట్టే ఎక్కువగా ఆ పాత్ర గురించి సీన్ గురించి నాపై విమర్శలు రాలేదు. ఒక వేళ ఆ సీన్ నచ్చకుంటే ఇప్పటికే నాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చేవి. కాని అవేవి రాకపోవడంతో ప్రేక్షకులు ఆ సీన్ ను వల్గర్ గా కాకుండా స్క్రీన్ ప్లేకు అవసరం అయిన సీన్ గా తీసుకున్నారు. అందుకే విమర్శలు రాలేదు. నాకు చేయడానికి ముందు ఆ సీన్ వల్గర్ గా అనిపించలేదు.. దర్శకుడు చాలా బాగా ఆ సీన్ ను చిత్రీకరించాడు. అందుకే నేను చేసేందుకు ఒప్పుకున్నాను అంటూ కియారా అసలు విషయాన్ని బయట పెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: