విక్టరీ వెంకటేష్ కి సూపర్ హిట్టిచ్చిన సినిమా గురు. ఈ సినిమాకు సిధ కొంగర దర్శకత్వం వహించారు. ఇప్పుడీ లేడీ డైరెక్టర్ మరో సినిమాను తెరకెక్కించబోతున్నారు. నాయకుడిగా, ప్రతినాయకుడిగా...44 ఏళ్ల నటజీవితంలో ఏ పాత్ర అయినా అవలీలగా పోషించగలరని మంచు మోహన్‌బాబు నిరూపించుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ ఆయన ఒకే ఒక్క లేడీ డైరెక్టర్‌తో సినిమా చేశారు. కృష్ణ హీరోగా గతంలో విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా నటించారు.


మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన మరోసారి లేడీ డైరెక్టర్‌ సుధ కొంగర దర్శకత్వంలో నటించే సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్‌ ఉన్న సూర్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 'సూరరై పోట్రు' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సూర్యే నిర్మాత కావడం విశేషం. ఇక ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్రకు మోహన్‌బాబు మాత్రమే పర్ఫెక్ట్‌గా సూటవుతారని ఆయనను అప్రోచ్‌ అయ్యారట చిత్రబృందం. ఈ సినిమా కథ, పాత్ర నచ్చడంతో  నటించడానికి ఆయన అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి గురువారం మోహన్‌బాబు చెన్నై వెళ్లారు. శుక్రవారం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరిగే షూటింగ్‌లో పాల్గొంటారు. 


బాక్సింగ్‌ నేపథ్యంలో హిందీలో 'సాలా కదూస్‌', తమిళంలో 'ఇరుది సుట్రు' పేరుతో సుధ కొంగర దర్శకత్వం వహించిన సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిన విషయం తెలిసిందే. 'ఇరుది సుట్రు'ని తెలుగులో 'గురు' పేరుతో సుధ కొంగర తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన డైరెక్టర్స్‌లో డిఫరెంట్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న సుధ కొంగర తాజాగా సూర్య–మోహన్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: