సూపర్ స్టార్ మహేష్ బాబు కు దేశ వ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా వీరాభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి మహేష్..తాజాగా తనకు ఎంతో ఇష్టమైన నటుడి తో ఫోటో దిగి..దానిని సోషల్ మీడియా అభిమానులతో పంచుకొని తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆండీ రాబర్ట్స్ అంటే మహేష్ కు ఎంతో ఇష్టం..అలాంటి ఆయన ఒక్కసారిగా మహేష్ కు తారస పడడం తో వెంటనే ఆనందం ఆపుకోలేక ఫోటో దిగాడు.


సోషల్ మీడియాలో ఈ ఫొటోను పోస్ట్ చేసిన మహేష్ బాబు.. ఇది నాకు చాలా గొప్ప అనుభూతి. నేను ఆయనకు వీరాభిమానిని.. గొప్ప ఫ్యాన్ మూమెంట్. ఆండీ రాబర్ట్స్ ను కలవడంతో ఈ టూర్ మరింత స్పెషల్ అయ్యిందని మహేష్ బాబు చెప్పడం జరిగింది.


ప్రస్తుతం మహేష్ మహర్షి సక్సెస్ ను విదేశాల్లో గడుపుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ప్రపంచ కప్ లు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మొన్నటి ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ను చూస్తూ సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన విషయం తెల్సిందే. మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు ఇంకా వంశీ పైడిపల్లి అతడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: