దర్శకులతో సాధారణంగా చెప్పుకోతగ్గ సాన్నిహిత్యం మహేష్ కొనసాగించడు. దీనికి భిన్నంగా మహేష్ లండన్ నుండి దర్శకుడు వంశీ పైడిపల్లిని అతడి కుటుంబంతో కలిసి రమ్మని చెప్పడమే కాకుండా అతడితో కలిసి లండన్ లో కొద్దిరోజులు సరదాగా గడపడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ప్రస్తుతం ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

‘మహర్షి’ మూవీ కలక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసింది అన్న విషయాలను పక్కకు పెడితే మహేష్ కి కెరియర్ పరంగా ఒక లాండ్ మార్క్ మూవీగా మారింది అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి పరిస్థుతులలో వంశీ పైడిపల్లితో మరో సినిమాను చేసే ఉద్దేశ్యంలో మహేష్ ఉన్నాడు అంటూ ఇప్పటికే సంకేతాలు వినిపిస్తున్నాయి. 

ఇప్పుడు ఏకంగా వంశీ పైడిపల్లిని స్వయంగా లండన్ కు తన గెస్ట్ గా ఆహ్వానించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో మరొక మూవీ వచ్చేసంవత్సరం గ్యారెంటీ అన్నవార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని అనీల్ రావిపూడి ఈ సంవత్సరం చివరికి పూర్తి చేయబోతున్న నేపధ్యంలో అన్నీ కుదిరితే వచ్చే ఏడాది మార్చి లోపే మహేష్ వంశీ పైడిపల్లిల కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం లండన్ లో హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ తనకు బాగా నచ్చిన ఒకనాటి సూపర్ ఫాస్ట్ బౌలర్ క్రికెట్ లెజెండ్ ఆండీ రాబర్డ్స్‌తో కలిసి తీయించుకున్న ఫోటోను తన ట్విటర్ ద్వారా షేర్ చేసాడు. ‘ఇది నాకు గొప్ప అనుభూతి అని నేను ఆయనకు పెద్ద అభిమాని హ్యూజ్ ఫ్యాన్ బాయ్ మూమెంట్’ అంటూ ట్వీట్ చేసి మహేష్ తన డ్రీమ్ సెలెబ్రెటీతో గడిపిన మధురక్షణాలను గుర్తుకు చేసుకున్నాడు. ఈవారాంతానికి తిరిగి ఇండియా రాబోతున్న మహేష్ కొంత రెస్ట్ తీసుకుని ఈనెల 28 నుండి ప్రారంభం కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ కి రెడీ కాబోతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: