రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు సినిమాల కోసం ఇబ్బంది పడింది.  హిందీలో దే దే ప్యార్ దే సినిమా హిట్ కొట్టిన తరువాత రకుల్ దశ తిరిగిపోయింది.  టాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు.  అందులోను రకుల్ ప్రీత్ హీరోయిన్.  సూర్య హీరోగా చేసిన ఎన్జీకే సినిమాలో నటించింది.  

కానీ, ఈ సినిమా బెడిసికొట్టడంతో పాపం రకుల్ ఇబ్బంది పడింది.  ఇటు టాలీవుడ్ లో మన్మధుడు 2 లో చేస్తున్నది.  నిన్న రిలీజైన ఈ సినిమా టీజర్ అదరహో అనిపించే విధంగా ఉండటంతో సినిమాపై ఆశలు పెరిగాయ్.  తప్పకుండా మరో హిట్ అవుతుందని నమ్మకం ఏర్పడింది.  

రకుల్ తమిళంలో మరో సినిమా ఆఫర్ వచ్చినట్టు సమాచారం.  విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో 63 వ సినిమా తెరకెక్కుతోంది.  చాలా వరకు సినిమా కంప్లీట్ అయ్యింది.  ఈ సినిమా తరువాత రకుల్ లోకేష్ కనగల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.  

ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.  దర్శకుడు లోకేష్ ఇప్పటికే రకుల్ ను సంప్రదించి దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది.  విజయ్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటోంది.  ఇప్పటికి అవకాశం దొరికింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: