సినిమా ఇండస్ట్రీలో పుకార్లు సర్వ సాధారణం. హీరో హీరోయిన్లకు సంబంధాలు పెట్టేస్తుంటారు జనం. అయితే అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళు నోరు విప్పితే గానీ తెలియదు. తాజాగా కియారా అద్వానీ కూడా ఒక హీరోతో తన సంబంధం గురించి వెల్లడించింది.

ప్రస్తుతం కియారా అద్వానీ "కబీర్ సింగ్" సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఇందులో షాహిద్ కపూర్ కి జోడీగా నటిస్తుంది. ఆ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆమెను సిద్ధార్థ్ మల్హోత్రా తో తనకున్న సంబంధం గురించి అడిగారు.

దానికి ఆమె చిన్నగా నవ్వేసి ఊరుకుంది. ఇంతకుముందు ఇటువంటి పుకార్లకు చాలా భయపడేదాన్నని, ఇప్పుడు వాటిని తేలికగా తీసుకోవడం అలవాటు చేసుకున్నానని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇటువంటి పుకార్లు రావడం సాధారణమని పేర్కొంది.

ప్రస్తుతం కియారా అద్వానీ నటిస్తున్న " కబీర్ సింగ్" సినిమా తెలుగులో సంచలనం సృష్టించిన " అర్జున్ రెడ్డి" సినిమాకి రీమేక్. ఈ సినిమా కి దర్శకత్వం వహించిన "సందీప్ రెడ్డి " వంగానే హిందీలో కూడా దర్శకత్వం చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: