సెలెబ్రిటీల్లో చాలా మంది ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి జంకుతుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు. "ఈషా గుప్తా" ఇదే కోవలోకి చెందుతుంది. ఏ విషయం మీదనైనా ఆమె మాట్లాడుతుంది.

ఆమె వ్యక్తిగత జీవితం గురించైనా, లేదా వృత్తిపరమైన విషయాల గురించి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంది.  అయితే ఈ మధ్య ఒక విషయం ఆమెని బాగా డిస్టర్బ్ చేసిందట.

అదేంటంటే, ఈషా గుప్తా తన ఆధార్ కార్డ్ లో వివరాలు  అప్ డేట్  చేద్దామని ట్రై చేసిందట. సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో  విసుగు చెంది ఆధార్ అధికారులకి ట్విట్టర్ ద్వారా మెసెజ్ చేసిందట. మూడు రోజుల వరకి వాళ్ళ నుండి ఎటువంటి స్పందన రాలేదు.

మూడు రోజుల తర్వాత ఆధార్ నుండి తమకి డైరెక్ట్ గా మెసెజ్ చేయమని రిప్లై వచ్చింది. దీంతో విసుగు చెందిన "ఈషా" ఆధార్ సేవలు చాలా దరిద్రంగా ఉన్నాయని పోస్ట్ చేసింది. తర్వాత ఈ పోస్ట్ ని డిలీట్ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: