టాలీవుడ్ అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ వెంటనే వచ్చిన రెండు సినిమాలతో దారుణమైన డిజాస్టర్స్ అందుకున్నాడు.  మరోసారి కొరటాల శివతో ‘భరత్ అనే నేను’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ఈ సంవత్సరం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. 


అయితే కొంత కాలంగా ఒకే తరహా సినిమాలు చేస్తున్న మహేష్ బాబు కొత్త దనం కోసం పూర్తి ఎంట్రటైన్ మెంట్ జోనర్ లో నటించాలని  తాపత్రయపడుతు న్నాడ.  ఈ నేపథ్యంలో వరుసగా తన కామెడీ సినిమాలో హ్యాట్రిక్ అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’సినిమాలో నటిస్తున్నారు మహేష్ బాబు.  ఈ ఏడాది ఎఫ్ 2 లాంటి కామెడీ ఎంట్రటైన్ మెంట్ అందించిన అనీల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం మంచి స్క్రిప్ట్ చూపించడం దానికి మహేష్ వెంటనే ఓకే చేయడం జరిగిపోయిందట. 


ఇక ‘అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న సందీప్ రెడ్డి వంగా, అదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు.  అప్పట్లో వంగా సందీప్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమాలో నటించబోతున్నాడని..దాదాపు కథ కూడా ఓకే అయ్యిందని తెగ వార్తలు వచ్చాయి. కట్ చేస్తే మహేష్ బాబు వరుసగా వేరే దర్శకులతో కమిట్ అవుతూ వచ్చారు. 

ఈ ప్రస్తావన రెండేళ్ల కిందటే వచ్చినా..ఈలోగా వంశి పైడిపల్లి తాజాగా అనీల్ రావిపూడిలతో కమిట్ కావడం సినిమాలు తీయడం కూడా జరిగిపోతుంది.  అందువలన ఇప్పట్లో సందీప్ వంగాతో సినిమా లేనట్టేనని అంటున్నారు. మహేశ్ నుంచి కబురు రాకపోవడంతో కుదిరితే మరో హిందీ మూవీ .. లేదంటే మరో హీరోతో తెలుగు సినిమా చేసే ఆలోచనలో సందీప్ వంగా వున్నాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: