సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో త్వరలో సెట్స్ పై వెళ్ళబోతున్న కొత్త మూవీ సరిలేరు నీకెవ్వరు. మహేష్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రోజు రోజుకు ఎంతో హైప్ క్రియేట్ అవుతోంది. అప్పుడే కొందరు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్, అయన సోల్జర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఎడిట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అటువంటి చాలా ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఎంత హైప్ క్రియేట్ అయినప్పటికీ ఈ సరిలేరు నీకెవ్వరు సినిమా తప్పకుండా అన్ని అంచనాలు అందుకుంటుందని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. 

నిజానికి చాలా రోజుల నుండి మెసేజి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తున్న మహేష్ బాబు, మరొక్కసారి తనలోని పూర్తి స్థాయి కామెడీ యాంగిల్ ని ఇందులో చూపించబోతున్నట్లు ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి తెల్పడం జరిగింది. అయితే మొన్న విడుదలైన భరత్ అనే నేను, అలానే నిన్న విడుదలైన మహర్షి అన్ని ప్రాంతాలు సహా ఓవర్సీస్ లో కూడా మంచి బిజినెస్ చేసాయి. కానీ భరత్ అనే నేను స్థాయి కలెక్షన్లు ఓవర్సీస్ లో సంపాదించడంలో మహర్షి విఫలమయింది. దానికి కారణం ఆ సినిమాకు సరిగా ప్రమోషన్ సరిగా చేయకపోవడం, అలానే అదే సమయంలో హాలీవుడ్ యూనివర్సల్ బ్లాక్ బస్టర్ అవెంజర్స్ సినిమా థియేటర్స్ లో ఉండడం మరొక కారణమని కొందరు విశ్లేషకులు అంటున్నారు. నిజానికి మహేష్ సినిమాలు ఓవర్సీస్ లో దుమ్మురేపుతాయి, 

అయితే మహర్షి విషయంలో అది పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆయన పని ఓవర్సీస్ లో అయిపోయిందని కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదని వారు అంటున్నారు. ఇకపోతే మహర్షి మంచి బలమైన కథాంశంతో కూడిన స్టోరీ కావడం, అదీకాక లెంగ్త్ పరంగా కూడా బాగా ఎక్కువ ఉండడం అనేవి దానికి కొంత సమస్యగా పరిణమించిన అంశాలని, అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో అటువంటివి ఏమి ఉండకపోవచ్చని, అదీకాక ఓవర్సీస్ లో ఎంటర్టైనర్ మూవీస్ కు ఎప్పటికీ ఆదరణ తగ్గదని, కాబట్టి ఈ సినిమాకు కనుక తొలిరోజు మంచి టాక్ వస్తే, మహేష్ బాబు అక్కడ కూడా నాన్ బాహుబలి రికార్డు కొట్టడం ఖాయమని, దీనితో అన్ని ఏరియాల్లో లెక్కలు సరి అవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ లెక్కలను మన సూపర్ స్టార్ ఎంతవరకు సరి చేస్తారో చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: