మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు మల్టీ స్టారర్లు గా దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.  బాహుబలి తర్వాత వస్తున్న రాజమౌళి సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.

ఈ సినిమా ప్రారంభంలోనే ఎవరెవరు నటిస్తున్నారనేది ప్రకటించారు రాజమౌళి. 1920 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విలక్షణ కథాంశం కావడంతో హీరోయిన్స్ ఎంపికపై భారీ కసరత్తులు చేసాడు.

చివరకి చెర్రీ సరసన అలియాభట్ ను, తారక్ సరసన  బ్రిటిష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ లను ఎంపిక చేసారు. అయితే కొన్ని కారణాల వల్ల డైసీ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో ఎవరు నటిస్తారా అని ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో నిత్యా మీనన్ పేరు బలంగా వినిపించింది. అనూహ్యంగా సాయి పల్లవి పేరు తెర మీదకొచ్చింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో ఇంకా తెలిసి రాలేదు. అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: