నాగార్జున మన్మధుడు 2 సినిమా చేస్తున్నాడు.  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.  సినిమా  సినిమా రిలీజైతే దాని ప్రభావం ఆ సినిమాపై పడుతుంది.  


 సినిమా ఎంత బాగున్నప్పటికీ రిలీజ్ విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి.  అలా అడుగులు వేస్తేనే.. సక్సెస్ వైపు అడుగులు వేస్తుంది సినిమా.  గతంలో దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం సినిమాను నిర్మించాడు.  ఈ సినిమా విజయ్ దేవరకొండ సినిమా గీత గోవిందం రిలీజ్ కు వారం రోజల ముందు రిలీజ్ అయ్యింది.  


సినిమా పర్వాలేదు అనిపించింది.  ఈ సినిమాను హిట్ చేసేందుకు దిల్ రాజు చాలా ప్రయత్నం చేశాడు.  ఈలోగా గీత గోవిందం విడుదల కావడంతో.. ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో దూసుకుపోయింది.  ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 


ఇప్పుడు నాగార్జున కూడా అదే తప్పు చేస్తున్నట్టు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  మన్మధుడు 2 కు బాగుందని రెస్పాన్స్ వచ్చినా.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.  సాహో టీజర్ కూడా అదే రోజున ఉండటంతో మన్మధుడి పై ఎఫెక్ట్ పడింది.  ఇక మన్మధుడు 2 సినిమా ఆగష్టు 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. 


అలాగే సాహో ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  అంటే వారం సినిమాలు వారం మాత్రమే గ్యాప్.  నాగ్ సినిమాకుపాజిటివ్ టాక్ వచ్చినా.. సాహో సినిమా రిలీజ్ తరువాత థియేటర్స్ దొరకవేమో మరి.  వారం రోజుల వ్యవధిలో ఎంత గట్టిగా వసూళ్లు సాధించినా పెద్దగా ఉండదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: