చాలా మంది హీరో, హీరోయిన్స్‌కి వాళ్ళు నటించే సినిమాలలో పాట పాడి తమ గొంతు ప్రేక్షకులకు వినిపించాలనుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్, తారక్..ఇలా హీరోస్ దగ్గర్నుంచి..నిత్యామీనన్, శృతి హాసన్, కీర్తి సురేష్ వరకు హీరోయిన్స్ కూడా పాటలు పాడేస్తున్నారు. మన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా హీరో, హీరోయిన్స్ ని సింగర్స్ గా బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళలో దేవీ శ్రీ,,థమన్ ముందుంటారు. ఇక గత కొన్నిరోజుల కిందట... మహర్షి ఫంక్షన్ లో పూజాహెగ్డే.. తను పాటలు పాడతానని, దేవిశ్రీ ప్రసాద్ తనకు ఓ ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని మనసులోని మాటను చెప్పింది. 


అందుకు కచ్చితంగా పూజాతో పాట పాడిస్తానని దేవిశ్రీ ఆ సమయంలో పూజకు మాటిచ్చాడు. కానీ ఇప్పుడు అంతకంటే ముందే ఆ అవకాశాన్ని వాడుకోబోతున్నాడు తమన్.
అవును.. దేవిశ్రీప్రసాద్ కంటే ముందే పూజాహెగ్డేతో పాట పాడించబోతున్నాడు తమన్. అల్లుఅర్జున్ కొత్త సినిమాలో ఓ పాటను పూజాతో పాడిస్తే బాగుంటుందని చిత్ర బృందం అనుకుంటున్నట్లు న్యూస్. ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్, తమన్ మధ్య ఈ మేటర్ పై డిస్కషన్ నడుస్తోందట.


మరోవైపు తమన్ మాత్రం పూజాతో కొన్ని లైన్స్ పాడించినట్టు తెలుస్తోంది. ఆ గొంతు ఓకే అనుకుంటే, పూర్తి పాటను పూజాతోనే పాడించాలని ఆలోచిస్తున్నారు. మ్యాగ్జిమమ్ త్రివిక్రమ్ దీనికి ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే, ఇంతకుముందు అరవింద సమేత సినిమాలో పూజాతో పట్టుబట్టి డబ్బింగ్ చెప్పించిన ఘనత త్రివిక్రమ్ కే దక్కుతుంది. కాబట్టి, ఆమె పాట పాడతానంటే అభ్యంతరం చెప్పకపోవచ్చు. పూజాహెగ్డే పాట పాడితే, బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు అది మరో హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటికే కాస్టింగ్ పరంగా ఈ సినిమా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పుడు పూజా పాట కూడా యాడ్ అయితే అంచనాలు మరింత పెరుగుతాయని యూనిట్ కాన్‌ఫిడెంట్‌గా ఉన్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: