బాలీవుడ్ నుంచి ఎక్కువమంది హీరోయిన్లు టాలీవుడ్ కు వస్తుంటారు.  ఏంఎస్ ధోని సినిమాతో బాలీవుడ్ కు పరిచమైన కియారా.. ఆ సినిమా తరువాత ఏకంగా తెలుగులో మహేష్ తో సినిమా చేసింది.  మహేష్ బాబు హీరోగా చేసిన భరత్ అనే నేను సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్.  ఈ సినిమాతో ఆమె పేరు మారుమ్రోగిపోయింది.  సెకండ్ సినిమా రామ్ చరణ్ వినయ విధేయ రామ చేసింది.  ఈ మూవీ ఫ్లాప్ కావడంతో కియారకు టాలీవుడ్ లో ఆఫర్లు రావడం లేదు.  బాలీవుడ్ లో మాత్రం వరసగా సినిమాలు చేస్తోంది.  


ఇలా సినిమాలు చేస్తూనే.. ఈ భామ లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ చూసిన వాళ్లకు.. బాబోయ్ ఈమె కియారానేనా అనిపిస్తుంది.  స్వయంతృప్తి అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్  కొట్టింది.  ఇలాంటి హాట్ సీన్స్ ఉండే వెబ్ సిరీస్ అంటే మనవాళ్ళు ఎందుకు వదులుతారు చెప్పండి.  హాట్ సిరీస్ లో చేసిన కియారాకు బాలీవుడ్ అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించే అవకాశం వచ్చింది. 


అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  జూన్ 21 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.  తన ఫస్ట్ లవ్ గురించి  అనేక విషయాలు చెప్పింది.  


తాను 10 వ తరగతిలోనే ప్రేమలో పడ్డానని చెప్పింది.  10 వ తరగతిలో ఉండగా ఓ అబ్బాయిని ప్రేమించానని, ఆ అబ్బాయి అంటే చచ్చేంత ఇష్టం అని చెప్పింది.   ఇంట్లో వాళ్ళు ఆ వయసులో ప్రేమ ఏంటి చదువుకోమని చెప్పడంతో బ్రేకప్ చెప్పి చదువులో మునిగిపోయానని చెప్పింది.  ఇప్పుడు ప్రేమించే సమయం లేదని అంటోంది కియారా. 


మరింత సమాచారం తెలుసుకోండి: