ప్రభాస్ సాహో టీజర్ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తూ పరుగులు తీస్తోంది.  భారీ స్థాయిలో హిట్ కొట్టిన ఈ టీజర్.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అంచనాలకు మించి సంచలనాలు సృష్టిస్తోంది.  ఇప్పటికే 60 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.  


ఇదిలా ఉంటె, ఈ సినిమా తరువాత ప్రభాస్ జిల్ దర్శకుడు రాధాకృష్ణ తో జాన్ అనే సినిమా చేస్తున్నాడు.  ఇది పీరియాడికల్ టైమ్ జర్నీ స్టోరీ.  1920 కాలానికి.. నేటికీ సంబంధం ఉన్న సినిమా.  ఇటలీలోని ఓ గ్రామానికి ముడిపడిన సినిమా.  దీనిని ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు.  


ఈ సినిమాపై కూడా అంచనాలు తారా స్థాయిలోనే ఉన్నాయి.  దర్శకుడు రాధాకృష్ణపై ఇప్పుడు బాధ్యత పెరిగింది.  ఎందుకంటే సాహో విజువల్ ఎఫెక్ట్స్ తో భారీ చేజింగ్ లతో నింపేశారు.  తప్పకుండా రిలీజ్ తరువాత ఇది సంచలనాలు సృష్టించడం ఖాయం అని తేలిపోయింది.  


దీనికి మించేలా సినిమా జాన్ సినిమా ఉండాలి.  పీరియాడికల్ స్టోరీ కాబట్టి సహజంగా అంచనాలు ఉంటాయి.  ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ పెరుగుతుంది.  ఈ సినిమా కోసం ఏకంగా ఆ కాలానికి చెందిన ఇటలీ సెట్ ను ఫిలిం సిటీలో వేశారు. దీనికి కూడా దాదాపుగా రూ. 300 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించినట్టు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: