టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తన ప్రేమ వివరాలను బయటకు వెల్లడించాడు. విజయవాడకు చెందిన ఒక అమ్మాయితో ఆరేళ్ళుగా ప్రేమలో ఉన్నానని , త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నామని చెప్పాడు. ఆమె అచ్చమైన తెలుగింటి అమ్మాయి అని  తెలిపాడు.తాను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయికి చిత్ర పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ రాజ్ తరుణ్  తన లేడీ లవ్ కి సంబంధించిన ఆసక్తికర వివరాలు వెల్లడించాడు.

ఇటీవల ఓ అభిమాని రాజ్ తరుణ్ ని మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అని అడగగా, త్వరలోనే జరుగుతుందని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి ఎవరనే విషయం వెల్లడించలేదు. అయితే తాజాగా ఈ విషయం పై స్పందించాడు. తాను ఆరేళ్ళుగా ప్రేమలో ఉన్నానని, ఆమె విజయవాడకు చెందిన వ్యాపారవేత్త అని తెలిపాడు. ఆరేళ్ళ కిందట వైజాగ్ లో  మొదటిసారిగా తన  పుట్టినరోజు వేడుకల్లో  ఆమెను  చూసినట్లు వెల్లడించాడు. తొలి పరిచయంలోనే వాళ్ళ అభిరుచులు కలిశాయట.

ఆ తర్వాత తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం  మొదలైందని.. క్రమంగా ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడిందట. అలా వారి ప్రేమ కథ మొదలైందని, గత ఆరేళ్ళుగా వాళ్ళు ప్రేమించుకుంటున్నారని, ఆమె చాలా సింపుల్ గా ఉంటుందని, అందరి దృష్టిలో పడటం ఇష్టం లేదని తెలిపాడు.

ఆ అమ్మాయి అభిప్రాయాలను గౌరవిస్తానని, అందుకే ఆమె పేరు బయటకు వెల్లడించడం లేదని  తెలిపాడు. వాళ్ల ప్రేమ కి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారట. ఆమె తరచుగా రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతుందట. పెళ్ళికి తాను ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నానని తానే అలస్యం చేస్తొందని, వచ్చే ఏడాది తమ పెళ్ళి ఉంటుందని చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: