మహేష్ అనీల్ రావిపూడిల ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ షూటింగ్ ఈనెల 28న ప్రారంభం కాబోతోంది. వాస్తవానికి ఈ మూవీ హీరోయిన్ గా రష్మిక ఎంపిక కావడం వెనుక పెద్ద డ్రామా నడిచింది అని టాక్. ప్రస్తుతం ఈమె దక్షిణాది భాషలకు సంబంధించిన అన్ని మూవీలలోను నటిస్తున్న నేపధ్యంలో ఈమె మహేష్ సినిమాకు ఇవ్వవలసిన డేట్స్ ముందుగానే తమిళ హీరో శివ కార్తికేయ మూవీకి ఇచ్చేసినట్లు సమాచారం. 

దీనితో మహేష్ మూవీకి రష్మిక ఎంపిక కుదరదు అని భావిస్తున్న నేపధ్యంలో శివ కార్తికేయ మూవీ స్క్రిప్ట్ విషయంలో రష్మికకు ఏర్పడ్డ భేదాభిప్రాయాలు మహేష్ మూవీ కలిసి వచ్చింది అని అంటున్నారు. ప్రస్తుతం రష్మిక తాను నటించే సినిమాలలోని తన పాత్రల ఎంపిక విషయంలో చాల ఖచ్చితంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. 

తన పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోయినా ఆమె తాను నటించే హీరో స్థాయిని కూడ చూడకుండా రష్మిక సున్నితంగా ఆసినిమాను తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ విషయంలో లిప్ లాక్ సీన్స్ విషయంలో అనవసరంగా ఆమూవీలో సీన్స్ క్రియేట్ చేస్తే తాను నటించను అని ఖచ్చితంగా చెపుతున్నట్లు సమాచారం. 

తన షరతలకు అంగీకరించకపోతే ఆమూవీ ప్రాజెక్ట్ నుండి తాను వాకౌట్ చేస్తానని రష్మిక స్పష్టంగా చెపుతున్నట్లు తెలుస్తోంది. దీనితో అనిల్ రావిపూడి ప్రస్తుతం తాను తీస్తున్న మూవీ విషయంలో రష్మిక పాత్రకు ప్రాధాన్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా మలుస్తున్నట్లు సమాచారం. దీనితో టాప్ హీరోలకు టాప్ దర్శకులకు కూడ రష్మిక వాకౌట్ ప్రమాదం వెంటాడుతోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: