బాహుబలి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రముఖ డైరెక్టర్  రాజమౌళి  తీస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్".  ఈ సినిమాలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండటంతో  ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమాకు  ఊహించని అడ్డంకులు వస్తున్నాయి.

ఇది కొంచెం నెగెటివ్ సెంటిమెంట్ కి దారి తీసింది.  తాజాగా రాజమౌళి, నిర్మాత దానయ్య మధ్య కూడా విభేదాలు తలెత్తాయనే సమాచారం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.  ఈ వార్త అటు మెగా అభిమానుల్లోనూ, ఇటు నందమూరి అభిమానులను కలవర పెడుతున్నట్లు తెలుస్తోంది. 
 
ఆర్ఆర్ఆర్ కి వచ్చిన హైప్ ని చూసి అనుకున్న దానికంటే ఎక్కువ  మొత్తంలో ఖర్చు పెట్టి భారీ హంగులతో  ఈ సినిమాను నిర్మిస్తున్నారు దానయ్య. అయితే బిజినెస్ డీల్స్ కి సంబంధించిన విషయంలో  వీరిద్దరికీ విభేదాలు వచ్చాయని సమాచారం.
 
దీనికి కొర్రపాటి సాయి మధ్యవర్తిత్వం తీసుకుని రాజీ కుదిర్చాడని అంటున్నారు. కొర్రపాటి సాయి రాజమౌళి కి దానయ్యకి బాగా సన్నిహితుడు. రాజీ కుదర్చడంతో సమస్య తీరిపోయిందని ఆనందపడుతున్నారు అభిమానులు. ఇక అన్నీ అనుకున్నట్లు సమస్యలు తీరిపోయి సినిమా చిత్రీకరణ పూర్తి కావాలని కోరుకుంటన్నారు అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: