పటాస్ ఫుల్ టూ బిందాస్ అనే షో రవి శ్రీముఖిలకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది.ఈ జోడీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. కాలేజీలలో చదివే అమ్మాయిలు అబ్బాయిలు, కమెడియన్లు చేసే కామెడీ స్కిట్లు , కాలేజీ అబ్బాయి అమ్మయిలతో డైలాగులు చెప్పించటం పటాస్ షోను పెద్ద హిట్టు చేసాయి. ఈటీవీ ప్లస్ చానెల్లో హిట్టైన షోలలో పటాస్ షో ఒకటి.

 

కానీ గత కొన్నాళ్ళుగా శ్రీముఖి ఈ షోకు దూరమైంది. తన వ్యక్తిగత కారణాల వల్ల పటాస్ షోకు కొంతకాలం దూరంగా ఉంటున్నానని శ్రీముఖి చెబుతున్నా రవికి శ్రీముఖికి ఏదో గొడవ జరిగిందనే గాసిప్స్ ఐతే వినిపిస్తున్నాయి. ఆ గొడవ ఏంటో బయటకు రాకపోయినా ఆ గొడవ వల్లే ఇప్పుడు శ్రీముఖి పటాస్ షోకు దూరమైందని తెలుస్తోంది.

 

అంతకుముందే ఇద్దరు కమెడియన్లు పటాస్ షోకు దూరమయ్యారు. మరి శ్రీముఖి చెప్పినట్లే మరలా ఈ షోకు కొద్ది రోజుల తర్వాత వస్తుందో లేదో తెలిస్తే ఈ గాసిప్స్ నిజామో కాదో తెలుస్తుంది.ప్రస్తుతం పటాస్ షోకు వర్షిణి యాంకర్ గా ఉంది. రవి వర్షిణి కన్నా రవి శ్రీముఖి జోడీనే బాగుంటుందని పటాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: