టెలివిజన్ రంగంలో ఈ మద్య కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు.  జబర్ధస్త్, పటాస్ లాంటి కార్యక్రమాలు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.  ఇందులో వల్గారిటీ ఉంటుందని ఎన్ని ఆరోపణలు వచ్చినా..ఆ రెండింటికి రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతూనే ఉంది.  ఇక పటాస్ లోమెయిల్ యాంకర్ గా మంచి పేరుతెచ్చుకున్న రవి గతంలో పలుమార్లు తన నోటి దూలతో నెటిజన్లచేత ఛీ కొట్టించుకున్నాడు. 

ఆ మద్య ఓ టీవి షోలో ఏపి ప్రజలను కించ పరిచే విధంగా మాట్లాడారు. అంతే అప్పటి నుంచి ఈ యాంకర్ పై రక రకాల ట్రోలింగ్, కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.  ఈ ప్రజలు చూస్తేనే మీ ప్రోగ్రామస్ రన్ అవుతున్నాయని..అలాంటిది కనీస గౌరవం లేకుండా పిచ్చి పిచ్చిగా కామెంట్ చేయడం పద్దతి కాదని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

ప్రజలను అవమానించే విధంగా కామెంట్స్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. యాంకర్ రవి పర్సనల్ అసిస్టెంట్ ఫోన్‌కు కాల్ చేసి మండిపడుతున్నారు.  దాంతో ఈ వివాదం మరింత ముదిరిపోయేలా ఉందని భావించిన యాంకర్ రవి రంగంలోకి దిగారు  ఏపీ ప్రజలకు క్షమాపణలు చెబతూ వీడియో రిలీజ్ చేశాడు. ఆ రోజు టీవీలో జరిగింది ముమ్మాటికీ తప్పే అని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: