టెలివిజన్ షోలో " బిగ్ బాస్ " బాగా పాపులర్ అయింది. విజయవంతంగా ఇప్పటికే రెండూ సీజన్ లు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్ లోకి అడుగు పెట్టనుంది. ఒకటవ సీజన్ కి జూ. ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నాని వ్యాఖ్యాత గా వ్యవహరించగా, మూడవ సీజన్ వ్యాఖ్యాత కోసం చాలా మల్లగుల్లాలు పడింది బిగ్ బాస్ టీం. ఎట్టకేలకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు.
 
ఇప్పుడు బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్స్ ని వెతికే పనిలో ఉన్నారు. అయితే బిగ్ బాస్ టీం కొందరు  హై ప్రొఫైల్స్ సెలెబ్రిటీల దగ్గరకు వెళ్ళారట. అయితే వాళ్ళు అడిగే పారితోషికానికి షాక్ అవుతున్నారట. రీసెంట్ గా  కమెడియన్ అండ్ హీరో అయిన సునీల్ దగ్గరికి వెళ్ళారట.  సునీల్ బిగ్ బాస్ లో పాల్గొనడానికి రోజుకి 25
లక్షల పారితోషికం అడిగాడట.
 
ఇది విని బిగ్ బాస్ టీం షాక్ కి గురయ్యారట.  బిగ్ బాస్ షోలో ఇచ్చే అత్యధిక పారితోషికం లక్షరూపాయలు మాత్రమే. లాస్ట్ సీజన్ లో గీతా మాధురి ఈ పారితోషికాన్ని అందుకుంది.ఈ సీజన్  బిగ్ బాస్ వారు రోజుకి 2, 3 లక్షల కంతే ఎక్కువ ఇచ్చుకోలేరట. అందుకని వాళ్ళు వెంటనే మరో ఆలోచన లేకుండా సునీల్ ని పక్కన పెట్టేసారట. అలాగే పెద్ద పెద్ద సెలెబ్రిటీల దగ్గరికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నారట.
 
మరోవైపు సునీల్ లాంటి వారికి సినిమాలో ఒకరోజు నటిస్తే 5,10 లక్షలు ఇస్తారు. అటువంటిది సునీల్ 25 లక్షలు అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.  సునీల్ కి బిగ్ బాస్ లో పాల్గొనడం ఇష్టం లేక ఆ విషయం డైరెక్టుగా చెప్పలేక ఈ విధంగా అడిగి ఉంటాడని అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: