టాలీవుడు లో కొందరు హీరోయిన్లు వరుసగా ఛాన్సులు కొట్టేస్తున్నారు. అది కూడా మొదటి సినిమా ఇంకా చిత్రీకరణలో ఉండగానే రెండో సినిమాకి సంతకాలు చేస్తున్నారు. నిన్ని మొన్న కన్నడ బ్యూటీ అయిన "రష్మిక మందన్న" తన మొదటి సినిమా" ఛలో " రిలీజ్ అవకముందే  గీత గోవిందం సినిమాకి సైన్ చేసింది. ఇప్పుడు అదే బాటలో మరో హీరోయిన కూడా నడుస్తుంది.
 
తమిళ హీరోయిన్ అయిన "ప్రియాంక అరుల్ మోహన్"  ఇంతవరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. కె విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నాని హీరోగా చేస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. కనీసం ఇప్పటివరకు టీజర్ కూడా రాలేదు. అప్పుడే ఆమెకు ఇంకో ఆఫర్ వచ్చేసింది.
 
శర్వానంద్ తర్వాతి చిత్రంలో  హీరోయిన్ కోసం ప్రియాంక ని ఎంచుకున్నారట. దీనికి కొత్త దర్శకుడు అయిన "కిషోరుడు" దర్శకత్వం వహించనున్నారట. ఈయన చాలా లఘుచిత్రాలకు దర్శకత్వం వహించారు.అతని పని తీరు నచ్చి అతనికి అవకాశం ఇచ్చారట. ఇందులో హీరోయిన్ పాత్ర కి ప్రియాంక అయితేనే బాగా సూట్ అవుతుందని బావించారట నిర్మాతలు.



మరింత సమాచారం తెలుసుకోండి: