ఇస్మార్ట్ శంకర్ తో దర్శకుడు పూరి జగన్నాథ్ మాస్ హిట్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఉన్నారు. అందుకే ఏది చేసినా మాస్ మసాలా గట్టిగా దట్టించేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ రెగ్యులర్ ప్రమోషన్స్ ని కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చెయ్యాలని ఈ డైరెక్టర్ టార్గెట్ గా పెట్టుకున్నారు.
ఇక సినిమాకు సంబందించిన ఒక సాంగ్ పక్కా తెలంగాణ స్టైల్ లో ఉండేలా టెక్నీషియన్స్ ని వాడుకుంటున్నట్లు సమాచారం. దిమాక్ ఖరాబ్ అనే సాంగ్ ను ఇప్పటికే మణిశర్మ ట్యూన్ చేసి రెడీ చేశారు. ప్రస్తుతం పాట చిత్రీకరణలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. రామ్ లుక్ పై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ప్రస్తుతం మాల్దీవులలో చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు జరిగే షూటింగులో మిగతా పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. వచ్చే నెల 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. మాస్ మసాలాగా రూపొందుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. రిలీజ్ అయ్యాక చూడాలి పూరీ ఈ చిత్రంతోనైనా తిరిగి హిట్ కొడతారా లేదా అన్నది.